Friday, March 29, 2024

అక్టోబ‌రు 2 నుండి ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు

తిరుపతి : అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబ‌రు 2 నుండి 4వ తేదీ వ‌ర‌కు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వ‌హించ‌నున్నారు. ఇందుకోసం అక్టోబ‌రు 1న సాయంత్రం అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది. యాత్రికుల వల్ల, సిబ్బంది వల్ల తెలియక జరిగే దోషాలవల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement