Sunday, April 14, 2024

స్పీడ్ పెంచిన ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్

సెల్వరాఘవన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా రీమాసేన్ ఆండ్రియా హీరోయిన్ గా నటించిన చిత్రం యుగానికి ఒక్కడు. పదేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ప్రజాదరణ పొందింది. చోళ, పాండ్య రాజుల ఇతివృత్తంతో ఆసక్తికరమైన ట్విస్ట్ లతో ఈ మూవీ అప్పట్లో తెరకెక్కింది.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా ధనుష్ తో సెల్వరాఘవన్ సినిమా చేయబోతున్నాడు. కార్తీ కూడా ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తాడట. ఇక సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులను ఈ చిత్రం జరుపుకుంటుంది.ఇక స్క్రిప్ట్ పనులు పూర్తిచేసిన సెల్వరాఘవన్ షూటింగ్ కి సన్నాహాలు చేస్తున్నాడని తెలుస్తోంది. 2024లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సెల్వరాఘవన్ భావిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement