Friday, April 19, 2024

అభిమానుల పై ఎన్టీఆర్ సీరియస్… ఆపమన్నప్పుడు ఆపాలి

మత్తు వదలరా… సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీ సింహ. ఇప్పుడు రెండవ సినిమా తెల్లవారితే గురువారం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి కుమారుడే శ్రీ సింహ. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం బ్యానర్ లపై దర్శకుడు మణికంఠ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా మార్చి 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి తో పాటు ఎన్టీఆర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ… నేను ఎక్కువగా మాట్లాడ దలుచుకోలేదు రెండే రెండు ముక్కలు మాట్లాడతాను. మాములుగా నేను మాట్లాడడానికి ఎక్కువ ఇబ్బంది పడను. కానీ నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఇబ్బంది పడుతున్నాను.

రేప్పొద్దున్న నా కొడుకులు అభయ్, భార్గవ్ ఏదైనా సాధిస్తే వాళ్ల గురించి నేను రెండు ముక్కలు మాట్లాడాలంటే నేను ఎంత ఇబ్బందిగా ఉంటుంది. కొడుకులు విజయం సాధిస్తే తల్లిదండ్రులు ఎలాగైతే సైలెంట్ అయిపోతారో నా తమ్ముళ్లు సింహా, భైరవ సాధించిన విజయం స్థానం గురించి మాట్లాడటానికి నాకు మాటలు రావడం లేదు. ఈరోజు వీళ్లని చూసి నేను ఎంత ఆనందపడుతున్నానో.. రేపటి రోజున భార్గవ్, అభయ్ లను చూసి ఇంతే ఆనంద పడతానేమో. నన్ను ఇక్కడ ముఖ్య అతిథి అనో.. ఇంకేదో అని అనవసరమైన మాటలు ఏవో మాట్లాడేశారు కానీ.. నాకు 20 ఏళ్ల నుంచి దేవుడు ఇచ్చిన శక్తి మీరైతే నాకు దేవుడు ఇచ్చిన కుటుంబం మా కీరవాణి, జక్కన్న కుటుంబం. నా మంచి చెడ్డలలో, సుఖ దుఖాలలో నేను నా జీవితంలో తీసుకున్న ప్రతి నిర్ణయంలో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉన్న ఒకే ఒక్క కుటుంబం కీరవాణి, జక్కన్న కుటుంబం. నేను ఇక్కడికి ఒక కుటుంబ సభ్యుడిగానే వచ్చాన్నారు. అయితే ఎన్టీఆర్ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు అరిచి గోల చెయ్యటంతో వారి పై సీరియస్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement