Friday, April 26, 2024

3వేల మంది సినీ కార్మికులకు యశ్ ఆర్ధిక సహాయం

కరోనా మహమ్మారి కారణంగా సినిమా థియేటర్లు మూత పడ్డాయి. అలాగే షూటింగ్ లు నిలిచిపోయాయి. దీంతో చాలా మంది సినీ కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సినీ కార్మికులకు సహాయం చేయడానికి చాలామంది సినీ స్టార్స్ ముందుకు వస్తున్నారు. తాజాగా కేజిఎఫ్ హీరో రాక్ స్టార్ యశ్ కూడా తన వంతు విరాళం ప్రకటించారు.

ఇరవై ఒక్క విభాగాలలో పని చేస్తున్న మూడు వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి ఐదు వేలు చొప్పున మొత్తం ఒకటిన్నర కోటి రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారు. ఈ పరిస్థితిలో నేను చేస్తున్న సహాయం కష్టాలను శాశ్వతంగా దూరం చేస్తుందని కాదు…ఇది ఒక ఆషాకిరణంగా కష్టకాలంలో ఈ మూడు వేల మందికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాను అని చెప్పుకొచ్చారు యశ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement