Thursday, April 25, 2024

మీకెందుకు భయం…వంగలపూడి అనిత వార్నింగ్

కొండపల్లి అటవీప్రాంతంలో అక్రమ మైనింగ్ జరక్కపోతే, టీడీపీ నిజనిర్థారణ బృందాన్ని ఎందుకు అడ్డుకున్నారన్నారు వంగల పూడి అనిత. ముఖ్యమంత్రి అమలుచేస్తున్న రాజారెడ్డి రాజ్యాంగంప్రకారమే పోలీసులు నడుచుకుంటున్నారు. వారు చట్టం, న్యాయాన్ని అమలుచేయడంలేదు. టీడీపీ నిజనిర్ధారణ కమిటీ కొండపల్లికి వెళ్తే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఇబ్బందేమిటి.. అక్కడంతా సక్రమంగా ఉంటే, ఆయనే పోలీసులను తమకురక్షణగా పంపి, మైనింగ్ పరిశీలనకు అనుమతించాలన్నారు.

టీడీపీసభ్యులు మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక ఇస్తే, అది ముఖ్యమంత్రికే మంచిదికదా. టీడీపీనేతలను, కార్యకర్తలను అడ్డుకొని, జైళ్లలోపెట్టాలనిచూస్తే, రాష్ట్రంలోని జైళ్లు సరిపోవు. ప్రభుత్వమే దిగివచ్చి, అక్రమమైనింగ్ వ్యవహారాలను బహిర్గతంచేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే కొండపల్లితోపాటు, రాష్ట్రంలో జరిగే ప్రతి అక్రమమైనింగ్ ప్రాంతాన్ని టీడీపీ పరిశీలిస్తుందని అన్నారు అనిత.

Advertisement

తాజా వార్తలు

Advertisement