Friday, April 19, 2024

బాలయ్య సినిమాలో శృతిహాసన్ ?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు బాలకృష్ణ. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ కనిపించనుందట. ఇటీవల క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు గోపిచంద్. ఈ సినిమాలలో కూడా శృతి హాసన్ హీరోయిన్ గా మెప్పించింది. కాగా ఇప్పుడు మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాషూటింగ్ ను లాంచనంగా ప్రారంభించారు.

బాలకృష్ణ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఒక చరిత్రకారుని కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట గోపిచంద్. జూలై నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందనిమ్.. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోందని సమాచారం. అఖండ సినిమా పూర్తి కాగానే గోపీచంద్ సినిమా షూటింగులో జాయిన్ అవుతారట బాలకృష్ణ. బాలకృష్ణ శృతిహాసన్ కాంబినేషన్లో ఇది మొదటి సినిమా కావడం విశేషం..

Advertisement

తాజా వార్తలు

Advertisement