Friday, March 29, 2024

ప్రభాస్ గురించి వాళ్ళు చెప్పేవి అబద్ధం…కృతిసనన్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే దీంతోపాటు సలార్ సినిమా కూడా చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ప్రభాస్ మొదటి నుంచి కూడా సైలెంట్ గా ఉంటాడని మొహమాటం కూడా ఎక్కువ అని చెబుతూ ఉంటారు. అయితే అదంతా నిజం కాదని చెబుతోంది హీరోయిన్ కృతి సనన్. కృతి సనన్ ఆదిపురుష్ లో హీరోయిన్ గా నటిస్తోంది. కాదా ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ ఒకసారి మాట్లాడటం మొదలు పెడితే చాలా విషయాలు మాట్లాడతారని… హాయ్ చెప్పినప్పుడు మొదట కాస్త మొహమాటంగా అనిపించినా.. ఆ తర్వాత పూర్తిగా మారిపోతాడని చెప్పుకొచ్చింది.

ఒకసారి పరిచయం అయిన తర్వాత ఎంతో ఆత్మీయంగా మాట్లాడతారని… మాటకారి అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ప్రభాస్ కు సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఎక్కువ అని తెలిపింది కృతి సనన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement