Friday, March 29, 2024

ఛార్మి డెసిషన్ వెనుక కారణం ఏంటి ?

హీరోయిన్ ఛార్మి గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేదు. ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఛార్మి ప్రస్తుతం సినిమాలకు నటన పరంగా దూరంగా ఉన్నప్పటికీ… నిర్మాతగా రాణిస్తోంది. అయితే ప్రస్తుతం ఛార్మి విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న లైగర్ సినిమాను నిర్మిస్తోంది. అలాగే పూరి కొడుకు ఆకాష్ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ సినిమాను కూడా నిర్మిస్తోంది.

ఇది ఇలా ఉండగా తాజాగా అందరినీ షాక్ కి గురి చేస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది ఛార్మి. తను కొంతకాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు అనౌన్స్ చేసింది. అయితే సాధారణంగా సినీ స్టార్స్ ఇబ్బందికి గురి అయినప్పుడు , ట్రోల్స్ కి గురైనప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. కానీ అలాంటిది ఏమి లేకుండా ఛార్మి ఈ నిర్ణయం తీసుకోటం వెనుక ఏముంది అనేది తెలియరావటం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement