Tuesday, March 19, 2024

ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న విజువ‌ల్ వండ‌ర్ అవ‌తార్ ది వే ఆఫ్ వాట‌ర్..

జేమ్స్ కామెరూన్ సిల్వ‌ర్ స్క్రీన్ పై క్రియేట్ చేసిన విజువ‌ల్ వండ‌ర్ అవ‌తార్. 2009 లో రిలీజ్ అయిన ఈ మూవీకి సీక్వేల్ గా తీసిన మూవీ అవ‌తార్ : ది వే ఆఫ్ వాట‌ర్. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 16న రిలీజైన ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా 2.24 బిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ప్ర‌పంచ సినీ చ‌రిత్ర‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూడో సినిమాగా నిలిచింది. కాగా, తాజా సమాచారం ప్ర‌కారం.. ఈ మూవీ ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ద‌మైన‌ట్టు తెలుస్తోంది.

అమెజాన్ ప్రైమ్‌, ఆపిల్ టీవీతో పాటు వుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ సినిమా రిలీజ్ చేయ‌నున్నారు మేక‌ర్స్. ఉచితంగా కాకుండా రెంట‌ల్ విధానంలో ఈ నెల (మార్చి) 28వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. ఏప్రిల్ ఫ‌స్ట్ వీక్ త‌ర్వాత ఫ్రీ స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్న‌ట్లు తెలిసింది.

మ‌రి సిల్వ‌ర్ స్క్రీన్‌పై ప్రేక్ష‌కుల‌కు కొత్త ఎక్స్‌పీరియ‌న్స్‌ను పంచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకుంటుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అవ‌తార్ ది వే ఆఫ్ వాట‌ర్‌కు కొన‌సాగింపుగా అవ‌తార్ 3ని తెర‌కెక్కించ‌బోతున్నారు జేమ్స్ కామెరూన్‌. మూడో భాగాన్ని 2024 డిసెంబ‌ర్‌లో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement