Thursday, March 28, 2024

స్కూల్స్ ని మూసేయండి…విశాల్ ట్వీట్ వైరల్

ఇప్పుడు ఎక్కడ చూసినా చెన్నై లో ఉన్న పద్మశేషాద్రి బాల భవన్ స్కూల్ గురించే మాట్లాడుతున్నాడు. ఆ స్కూల్ లో కామర్స్ టీచర్ లైంగిక వేధింపులకి పాల్పడుతున్నాడని ఓ స్టూడెంట్ ఆరోపణలు చేసింది. చాలా మంది పూర్వ విద్యార్థినులు కూడా రాజగోపాల్ అనే టీచర్ తమని వేధించాడని సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు. కాగా ఇప్పుడు టీచర్ తో పాటూ స్కూల్ కూడా టార్గెట్ అవుతోంది.

అయితే ఇదే విషయం పై కోలీవుడ్ లోని అనేక మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో స్సందిస్తున్నారు. విశాల్ సైతం ఈ విషయంపై మండిపడ్డారు. కులాన్ని తీసుకు వచ్చి చర్చని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విశాల్ ట్వీట్ లో చేశారు. అలాగే స్కూల్ మూసేయమని డిమాండ్ చేశాడు. ఇంత వరకూ విద్యా సంస్థ తరుఫున బాధిత విద్యార్థినులకి ఎవ్వరూ క్షమాపణ చెప్పలేదని ఇలాంటి నేరాల విషయంలో తీవ్రంగా స్పందించాలని కోరుతూ సీఎం స్టాలిన్ క్యాబినేట్ లోని విద్యాశాఖ మంత్రిని కూడా ట్యాగ్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement