Saturday, April 20, 2024

విరూపాక్ష ప్రమోషన్స్ షురూ.. అనౌన్స్ చేసిన మేకర్స్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నెక్స్ ప్రాజెక్ట్ ‘విరూపాక్ష’. ఈ థ్రిల్లర్ మూవీకి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజ‌ర్‌తో సినిమా పై మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. సినమా రిలీజ్ కి ఇంకా మూడు వారాలు మిగిలి ఉండగా.. మూవీ టీమ్ ప్రమోషన్స్ ని వేగవంతం చేయాలని నిర్ణయించుకుంది.

రేపటి నుండి, భారీ ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నట్టు టీమ్ తెలిపింది. ముందుగా క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కోసం ఒక ఈవెంట్ నిర్వహించనున్నట్టు తెలిపింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం.

భీమ్లా నాయక్, SIR ఫేమ్ సంయుక్త మీనన్ విరూపాక్షలో కథానాయికగా నటిస్తున్నారు. బ్రహ్మాజీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 21న మల్టిపుల్ లాంగ్వేజ్ లో థియేటర్లలో రిలీజ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement