Wednesday, April 24, 2024

ఓటీటీ డీల్ రద్దు చేసుకున్న రానా !!

వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కుతున్న చిత్రం విరాట పర్వం. 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో రానా దగ్గుబాటి కామ్రేడ్ రవన్న పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే సాయి పల్లవి పల్లెటూరి అమ్మాయి వెన్నెల పాత్రలో కనిపించబోతోంది. ఇదిలా ఉండగా కరోనా కారణంగా చాలా సినిమాలు ఓటిటి బాట పడుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను కూడా ఓటీటీ లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ ఇప్పుడు ఆ డీల్ ను రద్దు చేసుకొని థియేటర్స్ లోనే రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే రిలీజ్ డేట్ ను మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఈ సినిమాలో భారతక్క గా ప్రియమణి, నివేద పేతురాజ్ ,నందితాదాస్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement