Friday, March 29, 2024

బాలయ్యను ఢీ కొట్టబోతున్న విజయ్ సేతుపతి ?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే సినిమాపై అంచనాలును కూడా పెంచాయి.

అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఆసక్తికరమైన అప్డేట్ ఈ సినిమాకు సంబంధించి ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాకు అదిరిపోయే క్యాస్టింగ్ ను వెతికే పనిలో ఉన్నాడట గోపీచంద్.

అందులో భాగంగానే ఈ విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని ఈ సినిమాలో ప్రతినాయకుడిగా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఎక్కడ లేనప్పటికీ… ఫిలింనగర్లో మాత్రం అందుకు సంబంధించి ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement