Wednesday, April 24, 2024

రాహుల్ సాంకృత్య‌న్ కి ఓకే చెప్పిన.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌

మ‌రోసారి ద‌ర్శ‌కుడు రాహుల్ సాంకృత్య‌న్ తో క‌లిసి ప‌ని చేయ‌నున్నాడ‌ట హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. గ‌తంలో వీరు టాక్సీవాలాతో హిట్ కొట్టారు.ఆ మధ్య నాని హీరోగా వచ్చిన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాకి దర్శకుడు రాహుల్ యే. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందనేది తెలిసిందే. అటు నాని .. ఇటు సాయిపల్లవి కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా అది నిలిచింది. అలాంటి రాహుల్ రాయలసీమ నేపథ్యంలోకి ఒక కథను విజయ్ దేవరకొండకి వినిపించడం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని టాక్.కాగా విజ‌య్ న‌టిస్తోన్న తాజా చిత్రంద ‘ఖుషీ’ సినిమా రెడీ అవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ఆయన జోడీగా సమంత కనిపించనుంది. ఈ నేపథ్యంలోనే ఆ తరువాత ప్రాజెక్టును విజయ్ దేవరకొండ లైన్లో పెట్టాడు. ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement