Thursday, April 25, 2024

చిరు చెల్లెలుగా ఆమె ఫిక్స్….షూటింగ్ కూడా అప్పుడే స్టార్ట్ ?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తో పాటు లూసిఫర్ రీమేక్ అలాగే వేదాళం రీమేక్ లో నటించబోతున్నాడు. వేదాళం రీమేక్ కు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా…. లూసిఫర్ రీమేక్ కు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. అయితే లూసిఫర్ రీమేక్ లో చెల్లి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలోనే మొదట ఆ పాత్ర కోసం రాధిక, ఖుష్బూ, విజయశాంతి, జెనీలియా, కీర్తి సురేష్, సాయి పల్లవి ఇలా చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి.

ఇక చివరకు బాలీవుడ్ నటి విద్యాబాలన్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఈమెనే ఫిక్స్ చేసినట్లు కూడా తెలుస్తోంది. విద్యాబాలన్ చివరగా నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కథానాయకుడు, మహానాయకుడు చిత్రంలో నటించారు. బాలకృష్ణ భార్యగా నటించింది విద్యాబాలన్. కాగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇదిలా ఉండగా మెగాస్టార్ పుట్టినరోజు ఆగస్టు 22న ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 22న ఈ టీజర్ విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement