Friday, March 29, 2024

నారప్ప రిలీజ్ పై సారీ చెప్పిన వెంకీ

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నారప్ప. తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన అసురన్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా ఓ టి టి లో రిలీజ్ అని అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా అభిమానులలో ల్ అసమ్మతి నెలకొంది.

ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లోని రిలీజ్ చేయాలని పట్టుబట్టారు అభిమానులు. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఓటీటీ లోనే రిలీజ్ కు సిద్ధమైంది. దీంతో అభిమానులకు సారీ చెప్పారు వెంకీ. కరోనా కారణంగా దేశంలో, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement