Thursday, March 28, 2024

ఓటీటీ లో వర్మ ‘D కంపెనీ’

ఇటీవల కాలంలో రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ చేస్తూ వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వర్మ…D కంపెనీ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. కాగా ఈ సినిమాను స్పార్క్ ఓటీటీ లో స్ట్రీమ్ చేయబోతున్నట్లు వర్మ ప్రకటించారు. నిజానికి మార్చి 26న ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయాలని మొదట భావించారు. కానీ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ఓటిటి లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement