Wednesday, March 27, 2024

ఓటిటి కే కొండపొలం మొగ్గు ?

బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా కృతిసనన్ హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఉప్పెన. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే వైష్ణవ్ తేజ్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెట్టాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. కొండపొలం నవల ఆధారంగా ఈ సినిమా దర్శకుడు తెరకెక్కించారు.

అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇపుడు విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు రెడీ అవుతున్నారట. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియేటర్స్ లో రిలీజ్ చేయడం సాధ్యం అవుతుందో లేదో తెలియదు. అందుకే ఓటీటీ లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇక మొదటి సినిమాతో మంచి హిట్ ను అందుకున్న వైష్ణవ్ ఈ సినిమా తో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement