Friday, April 19, 2024

ఓటీటీలోకి రానున్న ఊర్వ‌శివో రాక్ష‌సివో.. డిసెంబ‌ర్ 9నుంచి డిజిట‌ల్ స్ట్రీమింగ్‌

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన సినిమా ఊర్వశివో రాక్షసివో.. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ మూవీ గత నెలలో థియేటర్లలో విడుదలైంది. కాగా, ఇప్పుడు డిజిటల్ డెబ్యూ కోసం రెడీగా ఉంది. తెలుగు OTT ప్లాట్‌ఫారమ్ ఆహాలో ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న రిలీజ్ చేయనున్నట్టు ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌..

థియేటర్‌లలో ఈ సినిమాని మిస్ చేసిన‌ వారి కోసం వచ్చే శుక్రవారం నుంచి ఆహాలో అండుబాటులోకి రానుంది రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సునీల్, ఆమని, శంకర్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎం. అచ్చు రాజమణి నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement