Friday, April 19, 2024

వరల్డ్ టెలివిజన్ ప్రీమియన్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న ఊర్వశివో రాక్షసివో

అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ రాకేష్ శశి దర్శకత్వంలో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ మూవీ ఊర్వశివో రాక్షసివో. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించింది. కాగా, ఈ సినిమా ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహాలో గత ఏడాది నవంబర్ 04న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ని లాక్ చేసుకుంది.

ప్రముఖ టీవీ ఛానల్ జెమినీ టీవీ లో ఈ నెల (మార్చి) 26న సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుందని ఛానెల్ ప్రకటించింది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సునీల్, ఆమని, శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎం నిర్మించిన ఈ మూవీకి అచ్చు రాజమణి, అనూప్ రూబెన్స్ సంగీత దర్శకులుగా పని చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement