Tuesday, April 16, 2024

తుఫాన్ బాధితులకు ఊర్వశి రౌతేలా సహాయం

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎంతోమంది తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే అటువంటి వారి కోసం కొంత మంది సినీ స్టార్స్ ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఊర్వశి రౌతేలా కూడా ఐదు కోట్ల రూపాయలను కరోనా బాధితుల సహాయ నిధి అందించారు. తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు ఊర్వశి.

తాజాగా గోవా, మహారాష్ట్ర కేరళలను తౌక్టే తుఫాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనితో నిరాశ్రయులైన వారికి ఆహారాన్ని స్వయంగా అందించారు ఊర్వశి రౌతేలా. అంతేకాకుండా మూగ జీవాలకు కూడా ఆహారాన్ని అందించింది. ఇక ఇదే విషయమై నెటిజన్స్ కూడా ఊర్వసి పై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. ఇక ఈ ఏడాది టాలీవుడ్ లోకి బ్లాక్ రోజ్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతోంది ఊర్వశి.

Advertisement

తాజా వార్తలు

Advertisement