Thursday, March 28, 2024

పుష్ప లాస్ట్ షెడ్యూల్ పై అప్డేట్!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమా 2 పార్ట్ లుగా రిలీజ్ కాబోతోంది. ఎప్పటిలానే సుకుమార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఇక ఇటీవల డైరెక్టర్ సుకుమార్ కు అనారోగ్యం కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. అయితే ఈ షెడ్యూల్ ను నెలాఖరు కల్లా కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట సుకుమార్. అలాగే ఆ తర్వాత పలు కీలక పాత్రలో నటిస్తున్న వారికి చెందిన సన్నివేశాలను మన దేశంలోనే తెరకెక్కించబోతున్నారట. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement