Thursday, April 25, 2024

ఉదయ్ కిరణ్ చిత్రం @21 ఇయర్స్

ఉదయ్ కిరణ్ హీరోగా చిత్రం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సూపర్ సూపర్ హిట్ సాధించింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. అలాగే ఉదయ్ కిరణ్ తో పాటు హీరోయిన్ గా తెలుగు తెరకు రీమా సేన్ పరిచయం అయ్యారు. అలాగే ఈ చిత్రానికి కి ఆర్ పి పట్నాయక్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

ఆ తర్వాత ఉదయ్ కిరణ్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఉదయ్ కిరణ్ ప్రస్తుతం మనమధ్య లేకపోయినా తన సినిమాలతో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇక రీమాసేన్ విషయానికి వస్తే రీమాసేన్ ఈ సినిమా తర్వాత స్టార్ హీరోలతో నటించి స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఇక తేజ కూడా ఓ మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తేజ చిత్రం సీక్వెల్ కు చిత్రం 1.1 రెడీ చేసే పనిలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా… చిత్రం సినిమా నేటికీ ప్రేక్షకుల ముందుకు వచ్చి 21 ఏళ్లు. సరిగ్గా ఇరవై ఒక్క ఏళ్ల క్రితం ఇదే రోజున చిత్రం సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement