Saturday, April 20, 2024

బాలయ్య ఒకటి కాదు రెండు ఇస్తున్నాడు !!

నందమూరి బాలకృష్ణ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రస్తుతం అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సింహ, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో పూర్ణ, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా బాలయ్య ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని అనిల్ రావిపూడి దర్శకత్వం లో సినిమాలు చేయబోతున్నాడని గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

అయితే అందుకు సంబంధించిన ప్రకటనను ఎన్టీఆర్ జయంతి రోజు ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ప్రకటించలేదు. అయితే ఈనెల బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాలకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉంటాయని తెలుస్తోంది. అలాగే అఖండ నుంచి కూడా అప్డేట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement