Wednesday, March 27, 2024

ఒకే లొకేషన్ లో రెండు సెట్ లు…పవన్ కి కోసం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ కే దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే దీంతోపాటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. పీరియాడికల్ డ్రామా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే పవన్ ఇందులో దొంగ గా కనిపించబోతున్నాడు.

తాజా సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాలు కూడా ఒకే లొకేషన్ లో వేరు వేరు సెట్ లో షూటింగ్ ను జరుపుకొనున్నాయట. హైదరాబాద్ శివారులో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ కి సంబంధించి ప్రస్తుతం పోలీస్ స్టేషన్ నిర్మాణం జరుగుతుందట. అలాగే అదే లొకేషన్ లో హరిహర వీరమల్లు కోసం ఆగ్రా సెట్ నిర్మిస్తున్నారట. ఈ రెండు కూడా భారీ బడ్జెట్ తోనే తయారవుతున్న సెట్స్ కావటం విశేషం. ఇక 2022 లో ఈ ప్రాజెక్టులు రెండు సందడి చేయనున్నాయి.

బిగ్ బాస్ 5…ఈ సారి రానా వంతు ?

Advertisement

తాజా వార్తలు

Advertisement