Thursday, March 28, 2024

రామారావు సెట్ లో జాయిన్ అయిన ఇద్దరు ముద్దుగుమ్మలు

శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కొత్త కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ రజీషా విజయన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

అయితే తాజాగా ఈ ఇద్దరు కూడా షూటింగులో జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా చెబుతూ…ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. దివ్యాంశ కౌశిక్ మజిలీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. రజీషా కు మాత్రం ఇది తెలుగులో మొదటి సినిమా. ఇక ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనతో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement