Wednesday, April 24, 2024

లాస్ ఎఫెక్ట్….అందుకే వకీల్ సాబ్ ఓటిటికి !!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీను దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 9న రిలీజ్ అయిన ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు మంచి వసూళ్లను సైతం రాబట్టింది. బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో అంజలి, నివేద థామస్, అనన్య కీలక పాత్రలు పోషించారు. అలాగే శృతిహాసన్ పవన్ సరసన నటించింది.

అయితే ఏప్రిల్ 30 న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే అందుకు కారణం లేకపోలేదట. లేట్ కంటే త్వరగా వస్తే ఓటీటీ సంస్థ నుంచి ఎక్కువ మొత్తంలో సొమ్ము వచ్చే అవకాశం ఉందని దర్శక నిర్మాతలు ఈ ప్లాన్ చేశారట. అలాగే పవన్ ఫ్యాన్స్ కూడా ఈ నిర్ణయం పట్ల హ్యాపీగానే ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement