Thursday, April 25, 2024

మార్ఫింగ్ ఫొటోల‌ను షేర్ చేస్తూ త‌ప్పుగా ప్ర‌చారం చేస్తున్నారు.. సైబ‌ర్ క్రైమ్స్ పోలీసుల‌కు ప‌విత్ర ఫిర్యాదు

సీనియర్ నటుడు నరేశ్, క్యారెక్టర్ నటి పవిత్రా లోకేష్ మ‌ధ్య రిలేష‌న్‌ని అస‌భ్యంగా చిత్రీక‌రిస్తూ సోష‌ల్ మీడియాలో ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఇద్దరికీ పెళ్లి అని, సహజీవనం చేస్తున్నారని కథనాలు వస్తున్నాయి. దాంతో పవిత్రా లోకేష్ పై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. దీనిపై పవిత్రా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పట్ల ట్రోలింగ్ కు పాల్పడుతున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తనపై వస్తున్న కథనాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు ప‌విత్రాలోకేశ్‌. కొన్ని మీడియా చానళ్లు, వెబ్ సైట్లు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. తన ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్నారని, వాటిని వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement