Friday, April 19, 2024

ఆచార్య కు 12 రోజులు!!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఇక కాజల్ అగర్వాల్ చిరంజీవి సరసన ఈ సినిమాలో నటిస్తోంది. అలాగే రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇక మే 13 న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో పాటు చాలా సినిమాలు కరోనా కారణంగా సినిమా షూటింగ్ ను నిలిపివేశాయి.

ఇప్పుడు మళ్లీ కరోనా తగ్గుముఖం పడుతుండటంతో సినిమా షూటింగ్ లు రీస్టార్ట్ చేస్తున్నారు. అయితే ఆచార్య సినిమాకు సంబంధించి ఇంకా పన్నెండు రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట. ఈ విషయాన్ని కొరటాల శివనే స్పష్టం చేశారు. ఈ పన్నెండు రోజులు బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ అయ్యాక ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement