Thursday, April 25, 2024

ఓటీటీ దుమ్ముదులుపుతున్న ‘శ్రీకారం’

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రధానపాత్రలో నూతన దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం శ్రీకారం. భారీ అంచనాల మధ్య మార్చి 11న రిలీజ్ అయిన ఈ చిత్రం విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. వ్యవసాయం నేపథ్యంలో సందేశాత్మక చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా సన్ నెక్స్ట్ లో ఏ సినిమా కు కూడా రాని రెస్పాన్స్ ఈ సినిమాకు వస్తుందని మేకర్స్ చెబుతున్నారు.

థియేటర్స్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ… వసూళ్ళ పరంగా మాత్రం కాస్త వెనుకబడింది శ్రీకారం మూవీ. కానీ ఇప్పుడు ఓటీటీ లో మాత్రం సూపర్ సక్సెస్ ను సాధించింది. ఇక ఈ సినిమాలో శర్వానంద్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటించగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు ఈ సినిమాను నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement