Thursday, April 25, 2024

కేజీఎఫ్ అంతకు మించి!!

రాక్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కే జి ఎఫ్. ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అలాగే ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా కే జి ఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కుతోంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అయితే పార్ట్ వన్ లో చూపించినట్టే ఎమోషన్సాబ్ ను పార్ట్ 2లో కూడా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశాడట.

పార్ట్ వన్ లో అమ్మ సెంటిమెంట్ సీన్స్ హైలెట్ గా నిలిచాయి. ఇప్పుడు పార్ట్ 2లో కూడా అమ్మ సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తూ చూపించబోతున్నాడట. అలాగే రాఖీ బాయ్ కింగ్ మేకర్ గా ఎలా ఎదిగాడు అనేదాని పై స్ట్రాంగ్ ఎలివేషన్ సీన్స్ తో పార్ట్ 2 లో చూపించబోతున్నాడట. మరి చూడాలి ఇవన్నీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాయో.

Advertisement

తాజా వార్తలు

Advertisement