Friday, March 29, 2024

బుల్లితెరపై కూడా ఉప్పెన ఊపేసింది !!

బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , కృతి శెట్టి జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఉప్పెన. గతేడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు వసూళ్ల పరంగా కూడా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ కలిసి నిర్మించిన ఈ చిత్రం వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

మరోవైవు దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. ఇలా ఉండగా ప్రస్తుతం ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే తాజాగా బుల్లితెరపై ఈ సినిమా ప్రసారమైంది. తొలిసారి ప్రసారమైన ఈ సినిమాకు 18.5 టిఆర్పి రేటింగ్ వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement