Monday, March 25, 2024

హైదరాబాద్ టు కేరళ…. దృశ్యం 2 అప్డేట్

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నారప్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళ్ లో ధనుష్ నటించిన అసురన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది. కాగా వీటితో పాటు ఎఫ్2 సీక్వెల్ ఎఫ్ 3 తో పాటు దృశ్యం సీక్వెల్ లో కూడా వెంకీ నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా ఒక దాని తర్వాత ఒకటి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మార్చి 1న దృశ్యం సినిమాకు సంబంధించిషూటింగ్ ప్రారంభం కాగా హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది.

ఇప్పుడు మిగిలిన భాగం కోసం కేరళ వెళ్ళింది. అక్కడ జరిగే షెడ్యూల్ తో ఈ సినిమా మొత్తం పూర్తికానుందట. ఇక మొదట దృశ్యం రీమేక్ కు లో ఎవరు నటించారో వారే సీక్వెల్ లో కూడా నటించబోతున్నారు. దృశ్యం రీమేక్ కు నటి శ్రీప్రియ దర్శకత్వం వహించగా ఇప్పుడు మాత్రం మలయాళ దర్శకుడు దర్శకుడు జీతూ జోసఫే దర్శకత్వం వహిస్తున్నాడు. సమ్మర్ కానుకగా దృశ్యం2 రిలీజ్ చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. మరి ఈ సీక్వెల్ తో వెంకీ ఏ మేర ఆకట్టుకుంటాడో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement