Wednesday, April 24, 2024

బాలయ్య తో గోపిచంద్ మలినేని…అధికారిక ప్రకటన వచ్చేసింది

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బాలకృష్ణ ఈ సినిమా తరువాత గోపిచంద్ మలినేని తో దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ కాగా నేడు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు.

నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ మేరకు ఓ ట్వీట్ ను పెట్టింది. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నారు. అలాగే అఖండ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఇక ఇటీవల క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు గోపిచంద్.

Advertisement

తాజా వార్తలు

Advertisement