Thursday, April 25, 2024

అఫీషియల్….రాక్షసుడు2 అధికారిక ప్రకటన

రమేష్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం రాక్షసుడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పాటు కలెక్షన్స్ పరంగా కూడా బాగానే రాబట్టింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా ఈ రాక్షసుడు 2 తెరకెక్కబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన చేశారు.

రాక్షసుడు 2 పేరుతో ఉన్న ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ… ఓ బిగ్ స్టార్ హీరోగా నటించనున్నాడని ప్రకటించారు. అయితే ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు నటించట్లేదనేది అర్థమవుతోంది. ఇక ఈ సీక్వెల్ ను రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన విషయాలను త్వరలోనే తెలియజేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement