Thursday, April 25, 2024

మెగాస్టార్ కోసం బాలీవుడ్ లో వేట

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత లూసిఫర్, వేదాళం రీమేక్ లలో చిరంజీవి నటించబోతున్నారు. ఇందులో లూసిఫర్ రీమేక్ కు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే వేదాళం రీమేక్ సినిమాకు మెహర్ రమేష్ డైరెక్ట్ చేయబోతున్నారు. అలాగే వీటితో పాటు బాబీ దర్శకత్వంలో కూడా మెగాస్టార్ ఓ సినిమా చేయబోతున్నారు. మైత్రి మూవీస్ వారు ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

అయితే ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఇప్పటికే నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారట దర్శక నిర్మాతలు. ముఖ్యంగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ ను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మెగాస్టార్ ను ఢీకొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి నీ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్ గా సోనాక్షి సిన్హా ను తీసుకోబోతున్నట్లు టాక్ నడుస్తోంది. మరి చూడాలి ఇందులో ఎంత వరకు నిజం ఉందో.

Advertisement

తాజా వార్తలు

Advertisement