Friday, April 26, 2024

‘మారి’పై హైకోర్టు ఆగ్రహం

తమిళ్ స్టార్ హీరో ధనుష్ పై మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2015లో ధనుష్ ఖరీదైన రోల్స్ రాయిస్ కారు కొనుగోలు చేశారు. అయితే దీనిని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నందుకుగాను పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఆ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

చట్టానికి ఎవరు చుట్టం కాదని…పన్ను చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది. సామాన్య ప్రజలు పన్ను కడుతున్నప్పుడు సెలబ్రిటీలకు కట్టడానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించింది. లగ్జరీ కారు కొని మినహాయింపులు ఎలా అడుగుతారని ప్రశ్నించింది. కాగా దీనిపై ఇప్పటికే 50 శాతం పన్నులు చెల్లించానని మిగిలినది ఆగస్టు 9న చెల్లిస్తానని జవాబిచ్చారు ధనుష్.

Advertisement

తాజా వార్తలు

Advertisement