Saturday, April 20, 2024

సర్కారు వారి పాట ఆల్బమ్ పై మరో హామీ ఇచ్చిన థమన్ !!

పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక ఈ సినిమాకు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఎప్పటినుంచో ఈ సినిమా ఫస్ట్ లుక్ ఫస్ట్ సింగిల్ కోసం ఎదురుచూస్తున్న మహేష్ బాబు ఫ్యాన్స్ కి థమన్ మరోసారి హామీ ఇచ్చారు.

సర్కారు వారి పాట ఆల్బమ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఊహించిన దాని కంటే బిగ్ హిట్ అవుతాయని… తాము ముందు చెప్పినట్టుగానే కరోనా పరిస్థితులు చక్కబడ్డాక ఇస్తామన్న అప్డేట్ కూడా ఇస్తామని చెప్పుకొచ్చారు థమన్. అలాగే ఓ మిక్స్ ట్యూన్ కూడా అభిమానుల కోసం విడుదల చేశాడు. ఇక థమన్ ఇచ్చిన అప్డేట్ తో సినిమాపై ఫ్యాన్స్ లో మరింత ఆతృత ఎక్కువ అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement