Thursday, April 25, 2024

దృశ్యం 2 పై ఫేక్ ప్రచారాలు నమ్మకండి

బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన దృశ్యం సినిమాకు సీక్వెల్ గా దృశ్యం2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కేవలం… కేవలం 47 రోజుల్లోనే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. వాస్తవానికి మార్చి 5వ తేదీన హైదరాబాదులో మొదలైన ఈ సినిమా షూటింగ్ ను విక్టరీ వెంకటేష్ తన పాత్రకు సంబంధించి ఏప్రిల్ 15వ తేదీకి పూర్తి చేశాడు.

ఇదిలా ఉండగా కరోనా పరిస్థితుల్లో థియేటర్లు మూతపడడంతో ఓటీటీ లో దృశ్యం 2 ను రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ వారు ఈ సినిమా రైట్స్ ను 45 కోట్ల రూపాయలకు తీసుకున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కాగా తాజాగా ఇదే విషయంపై చిత్ర యూనిట్ స్పందించింది. ఇలాంటి రూమర్లను నమ్మవద్దని దృశ్యం సినిమాను ఓ టి టి లో రిలీజ్ గురించి ఎలాంటి నిర్ణయం జరగలేదని.. అలాంటిదేమైనా ఉంటే త్వరలోనే ప్రకటిస్తామని ట్విట్టర్ వేదికగా చిత్రయూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ మీనా తో పాటు నదియా, నరేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement