Friday, March 29, 2024

బోర్డ్ ఎగ్జామ్స్ క్యాన్సల్ చేయాలంటున్న సోను సూద్

లాక్ డౌన్ సమయం లో ఎంతోమంది పేద ప్రజలకు సహాయం చేసి వారి మనసులు గెలుచుకున్నాడు రియల్ హీరో సోనూసూద్. అప్పటినుంచి కూడా సహాయం అని ఎవరు అడిగినా కాదనకుండా సహాయం చేస్తున్నాడు. అయితే తాజాగా మరోసారి సోనూసూద్ విద్యార్థుల బాసట నిలిచాడు. భారతదేశంలో బోర్డ్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయాలని ఓ వీడియో రూపంలో డిమాండ్ చేశాడు.

సౌదీ, మెక్సికో, కువైట్ లాంటి దేశాలతో పోలిస్తే ఇండియాలో ఎక్కువ కరోనా కేసులు ఉన్నాయని… కానీ ఆ దేశాల్లో ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసినప్పుడు ఇండియాలో విద్యార్థులు, కుటుంబ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎందుకు పరీక్షలు క్యాన్సల్ చేయడం లేదని సోనుసూద్ ప్రశ్నించారు. ఈ సమయంలో ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే విద్యార్థుల ఆరోగ్యానికి సేఫ్ కాదని ఇంటర్నల్ అసైన్మెంట్ మెథడ్ ను ఫాలో అవుతూ ప్రమోట్ చేయాలని కోరారు సోనూసూద్.

Advertisement

తాజా వార్తలు

Advertisement