Friday, April 26, 2024

సుప్రీమ్ హీరోకు ఓల్డ్ ఏజ్ హోమ్ తరుపున కృతజ్ఞతలు

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ విజయవాడలోని అమ్మ ప్రేమ ఆదరణ అనే ఓల్డ్ ఏజ్ హోమ్ కు శాశ్వత భవనాన్ని కట్టించాడు. సరిగ్గా రెండేళ్ల కిందట అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ లోని పరిస్థితిని వివరిస్తూ నిర్వాహకులు సినీ ప్రముఖులు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సాయి ధరమ్ తేజ్ తన పుట్టినరోజు సందర్భంగా ఆ భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించుకుని అభిమానులకు పిలుపునిచ్చారు. తన అభిమానుల నుంచి లక్ష వరకు అందింది.

ఆపై తాను తన సొంత సొమ్ముతో శాశ్వత భవనాన్ని కట్టించి ఇచ్చారు. అయితే ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకులు సాయి ధరమ్ తేజ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ… నూతన భవనానికి ఫోటోలను పెట్టారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement