Tuesday, April 23, 2024

‘తలైవి’ ట్రైలర్‌ రిలీజ్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగ‌త న‌టి జయలలిత బయోపిక్‌ ‘తలైవి’. బాలీవుడ్ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రలో నటించారు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. మార్చి 23న కంగనా రనౌత్‌ పుట్టినరోజు సందర్భంగా ‘తలైవి’ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ చిత్రంలో ఎంజీఆర్‌ పాత్రలో అరవింద స్వామి నటించారు. జీవీ ప్రకాశ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌ కరుణానిధి పాత్రలో నటించగా.. జయలలిత నిచ్చెలి శశికళ పాత్రలో పూర్ణ నటించింది. ఈ పాత్ర కోసం 20 కేజీల బరువు పెరిగి కొద్ది నెలల్లో అంత బరువూ తగ్గింది కంగనా. ఎ.ఎల్‌.విజయ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ అందిస్తున్నాడు. ఈ సినిమాలో జయలలిత జీవితంలో జరిగిన కొన్ని తెలియని ఆసక్తికరమైన విషయాల గురించి చూపించబోతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 23న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

YouTube video


Advertisement

తాజా వార్తలు

Advertisement