Tuesday, April 23, 2024

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖుల భేటీ..

సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి మెగస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ఇండస్ట్రీలో సమస్యలపై చర్చించేందుకు చిరంజీవిని ఏపీ సీఎం జగన్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీంతో నిన్న సాయంత్రం చిరింజీవి ఇంట్లో సమావేశమైన సినీ ప్రముఖులు పరిశ్రమలో ఉన్న సమస్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్, డి సురేష్ బాబు, దిల్ రాజు, ఎన్వీ ప్రసాద్, మైత్రి మూవీస్ రవి ప్రసాద్, సుప్రియ, ఆర్ నారాయణమూర్తి, సీకళ్యాణ్, కొరటాల శివ, వివి వినాయక్ తో పాటు తదితర నిర్మాతలు దర్శకులు ఈ మీటింగ్ కు హాజరయ్యారు. బి, సి సెంటర్స్ లో టిక్కెట్ రెట్లు, విద్యుత్ టారిఫ్, సిని కార్మికులకు, థియేటర్ కార్మికుల, పలు సమస్యలపై సినీ పెద్దలు చర్చించారు. ప్రస్తుతం సిని ఇండస్ట్రీలో, థియేటర్ సమస్యలు మొదలగు వాటిపై సీఎంతో చర్చించాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ తరపున మంత్రి పేర్నినాని ఆహ్వానించిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: చీరకట్టులో అదరగొట్టిన అనుపమ

Advertisement

తాజా వార్తలు

Advertisement