Friday, April 19, 2024

ముఖ్య అతిథిగా ఎన్టీఆర్

‘మత్తు వదలరా’ ఫేం హీరో శ్రీసింహా, చిత్ర శుక్లా జంటగా నటించిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఈనెల 21న హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా రానున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. ఈ సినిమాకు మణికాంత్ దర్శకుడు. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై రజినీ కొర్రపాటి నిర్మించాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement