Thursday, March 28, 2024

తాప్సి రష్మీ రాకెట్…ఓటీటీ లో !!

ఝుమ్మంది నాదం చిత్రంతో సినీ ఇండస్ట్రీ లో అడుగుపెట్టారు హీరోయిన్ తాప్సీ. ఆ తరువాత కూడా టాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. అయితే అవి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అయితే ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు తాప్సీ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. తాజాగా తాప్సీ నటించిన లేడీ ఓరియంటెడ్ రష్మీ రాకెట్ చిత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

గుజరాత్ కు చెందిన అథ్లెట్‌ రష్మీ గా తాప్సీ ఈ సినిమాలో కనిపించనుంది. అకర్ష్‌ ఖురానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదల పై బిటౌన్ లో రకరకాల వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాత ఇదే విషయమై ఓ క్లారిటీకి కూడా వచేసారట. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లోను తాప్సి నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement