Thursday, April 25, 2024

డిజిట‌ల్ స్ట్రీమింగ్ కు సిద్ద‌మైన సూర్య‌ ఈటీ.. త్వ‌ర‌లో ఓటీటీలో

త‌మిళ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. లేటెస్ట్‌గా ఈయ‌న ‘ఈటీ:ఎవ్వ‌డికి త‌ల‌వంచ‌డు’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ‘ఆకాశం నీ హ‌ద్దురా’, ‘జై భీమ్’ వంటి రెండు వ‌ర‌స ఓటీటీ సినిమాల త‌ర్వాత థియేట‌ర్ల‌లో ఈటీ సినిమా రావ‌డంతో ప్రేక్ష‌కుల‌లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. తెలుగులో 4కోట్ల బిజినెస్ జ‌రుపుకున్న ఈ చిత్రం ఫైన‌ల్‌గా 3.10 కోట్ల షేర్ క‌లెక్ష‌న్ల‌ను సాధించి ఎబో యావ‌రేజ్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ద‌మైంది.

పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై క‌ళానిధి మార‌న్ నిర్మించాడు. సూర్య‌కు జోడిగా ప్రియాంక అరుల్ మోహ‌న్ హీరోయిన్‌గా న‌టించింది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 7 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌లు ‘నెట్‌ఫ్లిక్స్’, ‘స‌న్ఎన్ఎక్స్‌టి’ల‌లో స్ట్రీమింగ్ కానుంది. త‌మిళంతో పాటు తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement