Saturday, April 20, 2024

రాజమౌళి పక్కకి… లైన్ లోకి త్రివిక్రమ్ ? మహేష్ ప్లాన్ ఇదే !!

సూపర్ స్టార్ మహేష్ బాబు గతేడాది అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా తో సూపర్ డూపర్ హిట్ ను అందుకుని మంచి జోష్ లో ఉన్నాడు. ఇక ప్రస్తుతం గీతగోవిందం ఫేమ్ పరుశురాం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా ఏంటి అంటూ ఫ్యాన్స్ లో ఓ ప్రశ్న మొదలైంది.

కాగా ఇప్పటికే చాలామంది దర్శకులు మహేష్ తో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారట. అందులో ముఖ్యంగా రాజమౌళితో చేయవలసిన సినిమాపై అందరి దృష్టి పడింది. ఇక లేటెస్ట్ సమాచారం ప్రకారం మహేష్ తన 28వ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేయబోతున్నాడట.

గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో అతడు, ఖలేజా రెండు సినిమాలు కూడా పెద్దగా ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. ఈ సారి ఎలా అయినా సరే హిట్ కొట్టాలనే ఆలోచనలో ఇద్దరూ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఈ ఇద్దరూ ఈ సారి ఎలాంటి కథతో వస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement