Friday, April 19, 2024

ఎన‌ర్జీ నుంచే మైఖేల్ వంటి చిత్రాలు వ‌స్తాయి – సందీప్ కిష‌న్

హీరో సందీప్‌ కిషన్‌ యాక్షన్‌-ప్యాక్డ్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మైఖేల్‌’. రంజిత్‌ జయకోడి దర్శకుడు. ఇది పాన్‌ ఇండియా సినిమా. యాక్షన్‌ ఎంటర్‌-టైనర్‌ మాత్రమే కా దు, ఇందులో రొమాన్స్‌, డ్రామా, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉన్నాయి. తాజాగా నందమూరి బాలకృష్ణ మైఖేల్‌ థియేట్రిక ల్‌ -టైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్‌ గమనిస్తే మైఖేల్‌ ఒక అందమైన ప్రేమకథ. సందీప్‌ కిషన్‌ పాత్రలో జీవించాడు. సందీప్‌ తన ప్రేయసి పట్ల వున్న ప్రేమ, పెయిన్‌ రెండింటినీ అద్భుతంగా అద్భు తంగా చూపించారు. విజయ్‌ సేతుపతి స్పెషల్‌ ట్రీ-ట్‌ ఇచ్చా రు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ యాక్షన్‌ రోల్‌లో ఆకట్టు-కుంది. ఇందులో వరుణ్‌ సందేశ్‌ ముఖ్యపాత్రలో, అనసూయ భర ద్వాజ్‌ బలమై న పాత్రలో కనిపించింది.
ఈ చిత్రానికి త్రిపురనేని కళ్యాణ్‌ చక్రవర్తి, రాజన్‌ రాధామణలన్‌, రంజిత్‌ జయకోడి సంభాషణలు రాశారు.
-టైలర్‌ విడుదల కార్యక్రమంలో సందీప్‌ కిషన్‌ మాట్లా డుతూ ”బాలకృష్ణ గారికి మైఖేల్‌ -టైలర్‌ చాలా నచ్చింది. -టైలర్‌ చూసి అదిరిపోయింది’ చెప్పారు. ఈ సినిమా కోసం చా లా కష్టపడ్డాం. ఇంత కష్టపడటానికి ఎనర్జీ ఇచ్చింది ప్రేక్షకులే. ఆ ఎనర్జీ నుంచే మైఖేల్‌ వంటి సినిమాలు వస్తాయి. ఇది పూర్తిగా తెలుగు సినిమా. మన సినిమా. మనమందరం గర్వ పడే సినిమా. రంజిత్‌ అద్భుతంగా తెరకెక్కించాడు.” అని చెప్పారు.నిర్మాత భరత్‌ చౌదరి మాట్లాడుతూ ”సినిమా కం-టె-ంట్‌, బిజినెస్‌ పరంగా నిర్మాతలుగా మేము హ్యాపీగా వున్నాం.” అన్నారు
మైఖేల్‌ ప్రముఖ డిస్ట్రిబ్య్రూటర్‌ భరత్‌ చౌదరి, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌ రావు ల జాయింట్‌ ప్రొడక్షన్‌ వెంచర్‌. నారాయణ్‌ దాస్‌ కె నారంగ్‌ సమర్పకులు. ఈ చిత్రం ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ కార్యక్రమంలో వరుణ్‌ సందేశ్‌ కూడా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement