Saturday, April 20, 2024

సందీప్ కిషన్ మైఖేల్ ట్రైలర్ లాంచ్ చేయనున్న నంద‌మూరి నటసింహం

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ మొదటి పాన్ ఇండియన్ ఫిల్మ్ మైఖేల్‌. ఈ సినిమా వ‌చ్చే నెల (ఫిబ్రవరి) 3న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక మూవీ నుంచి వచ్చిన‌ టీజర్, పాటలు సినిమాపై భారీ పాజిటివ్ వైబ్స్ తెచ్చాయి. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా మూవీకి రంజిత్ జేకోడి దర్శకత్వం వహిస్తుండ‌గా.. దివ్యాంశ కౌశిక్ కథానాయికగా క‌నిపించ‌నుంది, అంతే కాకుండా ఈ మూవీలో మక్కల్ సెల్వన్త తో పాటు విజయ్ సేతుపతి ముఖ్యమైన పాత్రలో క‌నిపించ‌నున్నారు.

ఇక ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల (జనవరి) 23న నటసింహం నందమూరి బాలకృష్ణ లాంచ్ చేయనున్నారు అంటూ మేక‌ర్స్ భారీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, వరలక్ష్మి శరత్‌కుమార్, అనసూయ భరద్వాజ్, వరుణ్ సందేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement