Friday, April 26, 2024

రంగస్థలం సీక్వెల్ – వద్దంటున్న ఫ్యాన్స్

మామూలుగా ఓ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించింది అంటే ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తుంటారు దర్శక నిర్మాతలు. కాగా సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ రంగస్థలం. 2018 లో రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించడమే కాకుండా ఎన్నో అవార్డును కూడా గెలుచుకుంది. ఈ సినిమాలో చెవిటివాడిగా రాంచరణ్ నటన వేరే లెవెల్ లో ఉంటుంది.

అయితే ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది అంటూ ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ ఇద్దరూ తెసేది రంగస్థలం సీక్వెల్ అంటూ కూడా కొన్ని వార్తలు తెరపైకి వస్తున్నాయి. అయితే అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ… ఫ్యాన్స్ మాత్రం రంగస్థలం సినిమా జోలికి వెళితే ఈసారి దెబ్బ అయిపోతానని అనుకుంటున్నారట. అందుకే అది కాకుండా వేరే ఏదైనా సినిమాను ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ సుకుమార్ కు సలహా ఇస్తున్నారట. ఇక ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తో ఓ సినిమా చేయబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement